ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడుతున్నాయి. ఒంగోలు, ఒంగోలు రూరల్ మండలాల్లో రెండు గంటలపాటు కుండ పోత వర్షం కురిసింది. దీంతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ కూడలి జలమయమైంది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగి పడ్డాయి. ఇవాళ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.