నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, విశాఖలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.