వైఎస్ జగన్పై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారని టీడీపీ ట్వీట్ చేసింది. 'సీఎంగా ఉన్నప్పుడు జగన్ భయంకరమైన ఆలోచనలు చేసేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదాం అన్నారు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను' అంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ టీవీ డిబేట్లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా సీఎస్గా ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్యంను వైసీపీ ప్రభుత్వం బదిలీ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.