పోలవరం నిర్వాసితుల పునరావాసంపై జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిర్వాసితుల పునరావాస చర్యలు వివరించాలని సీఎస్కు నోటీసులు ఇచ్చింది. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ను జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా ఆర్అండ్ఆర్ వివరాలు ఇవ్వాలని సూచించింది.