గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణే లక్ష్యం

గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణ లక్ష్యంగా మహిళా సంఘాలు సమావేశాలలో చర్చించాలని ఎంపీడీఓ మల్లికార్జున్ అన్నారు. శుక్రవారం కొమరాడ వెలుగు కార్యాలయంలో గ్రామ సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తరుచూ వైద్య పరీక్షలు చేయించుకొని, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ఏపీఎం బీ. వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్