సత్తిబాబును కలిసిన జనసైనికులు

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు సత్తిబాబును జనసేన కార్యకర్తలు పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భామిని, వీరఘట్టం, పాలకొండ, వెలగవాడ, రాజపేట, గ్రామ జనసైనికులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్