ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలంలోని మీసాల డోలపేట గ్రామ సమీపంలో స్థానిక సోమన్నచెరువు గట్టుపై భారీ కొండచిలువ కలకలం రేపింది. ఎనిమిది అడుగుల కొండచిలువను గ్రామస్థులు ఆదివారం గుర్తించారు. ఈ మేరకు గ్రామస్థులు పొరాంకు చెందిన స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించడంతో ఆయన దానిని బందించారు. అనంతరం కొండచిలువను దూరంగా విడిచిపెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.