ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం: రామ్మోహన్

85చూసినవారు
ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం: రామ్మోహన్
కేంద్ర కేబినెట్‌లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు.’ అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్