కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తక్కువ మాటలు చెప్పి.. ఎక్కువ పని చేసి చూపిస్తానని అన్నారు పవన్. భారీ సభలు, సంబరాలతో కాకుండా.. పని చేసి పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా అని తెలిపారు.