రాయలసీమ ప్రాంతం బానిస సంకెళ్లలో ఉండిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. "చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైసీపీ వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమీ మిగలదు. జగన్ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైసీపీ నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు." అని పవన్ విమర్శించారు.