ఫేమ్-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 4 నెలలు పొడిగించబోతోందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఫేమ్-2 పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనున్న వేళ.. మరో 4 నెలలు గడువును పొడిగిస్తారని, ఇందుకోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని కేంద్రం స్పష్టంచేసింది.