ప్రభుత్వ మార్పిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తాజాగా ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ఎండ్ కార్డ్ పడింది. కాగా, జగన్ నేతృత్వంలోని అప్పటి వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది.