జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియమితులయ్యారు. దీంతో ఆయన మూడవసారి ఈ పదవిని చేపట్టనున్నారు. ఇక ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పీకే మిశ్రాను నియమించారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆ నియామకం అమలులోకి రానున్నట్లు అపాయింట్స్ కమిటీ తెలిపింది. పదవీకాలం సమయంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వనున్నారు. ప్రధానికి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్లను నియమించారు.