AP: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు.. పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారు. పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.