విశాఖ రుషికొండ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ఆ నిర్మాణాలు కూల్చేయాలంటూ లేఖ రాశారు. పరిహారాన్ని అధికారుల ఖాతాల నుంచి రాబట్టాలని పేర్కొన్నారు. కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినట్లు లేఖలో ప్రస్తావించారు. సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే విచారణ కమిటీ తేల్చిందని చెప్పారు.