AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలకలం రేపిన వైసీపీ నేత హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 25న పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు.. తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. భూ దందాలు, రెండు గ్రూప్ల మధ్య విభేదాలే హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.