వరద బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి సవిత

విజయవాడ వరద సహాయక చర్యల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. పెనమలూరు మండలం గణపతి నగర్, శ్రీనగర్ కాలనీలలో బోటులో స్వయంగా వెళ్లి వరద బాధితులను ఒడ్డుకు చేర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం మంత్రి మండలంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. వరద బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని ఆమె పేర్కొన్నారు. వరద నీటిలో ఉన్న వారు తక్షణమే గృహాలను ఖాళీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్