మీర్జాపురంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం

కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో.. మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొని గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్