గీతాంజలి మృతిపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. మంగళవారం విశాఖలోని ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా వారియర్స్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని, వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యనే నిదర్శనమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని కుట్రలను తట్టుకుని జగన్ నిలబడుతున్నాడంటే సోషల్ మీడియా బలమేనని అన్నారు.