అనంతపురం జిల్లా కూడేరు మండలం గొట్కూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. భవ్యశ్రీ వెంచర్లో స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులను ఛత్తీస్గఢ్కు చెందిన పూరన్సింగ్, హాసగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.