వైసీపీ నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల క‌లకలం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్‌ బాంబులు కలకలం రేపుతున్నాయి. ముప్పాళ్ల మండలం మాదలలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. వైసీపీ నేత సైదా ఇంట్లో 29 పెట్రోల్‌ బాంబుల్ని గుర్తించారు. కాగా, బుధవారం రాత్రి మాచవరం మండలం పిన్నెళ్లి గ్రామంలోనూ వైసీపీకి చెందిన ఐదుగురి నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్