ఢిల్లీ యూనివర్సిటీలో యోగా దినోత్సవం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముందుండి నడిపించాల్సి ఉంది. అయితే ఆయన రాకను అక్కడి విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. వారు నల్లజెండాలు ప్రదర్శించి ఆందోళన వ్యక్తం చేశారు. నీట్, UGC నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దాంతో చేసేదేమీ లేక మంత్రి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.