దానాపూర్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్కు వెళ్లే హోలీ ప్రత్యేక రైలులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. బీహార్లోని అర్రా స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే అగ్నిప్రమాదం జరిగింది. రైలులోని కోచ్ నంబర్ M-9లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలను చూసిన ప్రయాణికులు భయంతో కదులుతున్న రైలు నుంచి దూకడం ప్రారంభించారు. దీంతో రైలును వెంటనే నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.