మాంసం ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని అన్నారం గ్రామానికి చెందిన శ్రీకాంత్(39) సోదరిని కలిసేందుకు శుక్రవారం రాత్రి HYD వచ్చాడు. వారు లేకపోవడంతో కోఠిలో మద్యం తాగి చికెన్ బిర్యానీ తిన్నాడు. స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లక్ష్మీనగర్ కాలనీకి వచ్చి కుప్పకూలగా డ్రైవర్ కాలనీ కాలిబాటపై పడుకోబెట్టి వెళ్లిపోయాడు. శనివారం కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. శవపరీక్ష నిర్వహించగా గొంతులో మాంసం ముక్క కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు గుర్తించారు.