భారత స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్కి అరుదైన గౌరవం దక్కింది. 500 వికెట్ల క్లబ్లో చేరిన అతడిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(TNCA) ఘనంగా సన్మానించింది. టెస్టుల్లో అరుదైన మైలురాయికి గుర్తుగా.. 500 బంగారు నాణాలతో టీఎన్సీఏ ఈ స్పిన్ మాంత్రికుడిని సత్కరించింది. అంతేకాదు రూ.1 కోటి క్యాష్ను బహుమతిగా అందించింది. అనిల్ కుంబ్లే, రోజర్ బిన్నీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.