లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి

75చూసినవారు
లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి
ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వేకటాపూర్ లో ఆదివారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వెళ్తూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్