ALERT: ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్

80చూసినవారు
ALERT: ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారు.. ఈ అవకాశాన్ని వినియోగించేకోవాలని EC అధికారులు సూచించారు. కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో గాని, ఎన్నికల అధికారికి గాని అందజేయవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్