టెలికం పరిశ్రమలో పోటీ, టెక్నాలజీ కోసం పెట్టుబడులు పెరిగాయనే సాకుతో ఎన్డిఎ ప్రభుత్వ మద్దతుతో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు టారిఫ్ ధరల పెంపును చేపట్టాయి. చివరి సారిగా 2021 డిసెంబర్లో దాదాపు 20 శాతం టారీఫ్లను పెంచాయి. జియో 2016లో రూ.149కే అపరిమిత ఉచిత కాల్స్, డేటాను అందించింది. ఆ తర్వాత ఈ ప్లాన్ ధరను రూ.209కి, తాజాగా 249కి పెంచింది. ఈ లెక్కన ఇకపై ఒక్కో వినియోగదారుడిపై ఏడాదికి కనీసం రూ.1200 భారం పెరిగినట్లు. ఇదే బాటలో మిగితా ప్రయివేటు టెల్కోలు ప్రయాణించాయి.