భారత సంతతికి చెందిన వ్యక్తిని ఓ అమెరికన్ కొట్టి చంపాడు. హేమంత్ మిస్త్రీ (59)కి ఓక్లహోమాలో రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తితో గొడవైంది. పార్కింగ్ స్థలంలో జూన్ 22న వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికే హేమంత్ మిస్త్రీపై రిచర్డ్ దాడి చేశాడు. హేమంత్ ముఖంపై రిచర్డ్ గట్టిగా పంచ్ ఇచ్చాడు. దీంతో హేమంత్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.