తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. దర్శనాకికి ముందు ఆలయం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అమిత్ షాకు స్వాగతం పలికి స్వామి వారి దర్శనానికి తీసుకెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం అమిత్ షా తీర్థప్రసాదాలు స్వీకరించి, వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు.