రాష్ట్ర చిహ్నం ఆమోదంలో మరో ట్విస్ట్

65చూసినవారు
రాష్ట్ర చిహ్నం ఆమోదంలో మరో ట్విస్ట్
రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక చిహ్నాల్లో మార్పులు జరగాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. తెలంగాణ అధికారిక చిహ్నంలో ఇప్పుడు మార్పులు చేసినట్లయితే కేంద్ర హోంశాఖకు సమాచారాన్ని ఇవ్వడంతో పాటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే సీఎం మొదలు అధికారుల వరకు లెటర్ హెడ్‌లపైన, ఆఫీసుల్లో, వాహనాలపై ఆ చిహ్నాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అయితే మార్పులకు సంబంధించి కేంద్ర హోంశాఖకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం వెళ్లలేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్