హైదరాబాద్ రెడ్హిల్స్లో ఉన్న ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఏఈలు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.