ఒడిశాలో విషాదం జరిగింది. గురువారం వడదెబ్బ కారణంగా 10 మంది మృతిచెందారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి ఇంఛార్జ్ డైరెక్టర్ సుధారాణి ప్రధాన్ తెలిపారు. ‘మృతుల శరీర ఉష్ణోగ్రతలు దాదాపు 103-104 డిగ్రీల ఫారెన్ హీట్గా ఉన్నాయి. ఇది వాతావరణ పరిస్థితులను బట్టి చాలా ఎక్కువగా ఉంటుంది’ అని సుధారాణి పేర్కొన్నారు.