టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 35 పరుగుల తేడాతో చిత్తు చేసి మిగతా జట్లకూ హెచ్చరికలు పంపింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 257/4 స్కోరు సాధించింది. పూరన్ (75), పావెల్ (52), రూథర్ఫర్డ్ (47) విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 222/7కే పరిమితమైంది. జోష్ ఇంగ్లిస్ (55) ఒక్కరే రాణించారు.