బిహార్లో మరో బ్రిడ్జి కూలిపోయింది. కిషన్ గంజ్ జిల్లాలోని కంకై ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల వంతెన గురువారం కూలిపోయింది. ఇది బహదుర్గంజ్, దిఘల్బ్యాంక్ బ్లాక్లను కలుపుతుంది. దీంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా, ఇటీవల బిహార్లో మూడు వంతెనలు కూలిపోగా, ఇప్పుడు మరో వంతెన కూలిపోవడం కలవరపెడుతోంది. ఈ వంతెనను ఆరేళ్ల క్రితమే నిర్మించినట్టు తెలుస్తోంది.