టీపీసీసీ చీఫ్ ఎన్నికపై అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. ముఖ్య నాయకులను అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్.. ఇంఛార్జి దీపా దాస్ మున్షి భేటీ కానున్నారు. అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పార్లమెంట్ హాల్ లో సోనియాగాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ యాష్కీ కలిసి తమ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.