చెన్నైలోని పమ్మల్లో తాజాగా విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ రెస్టారెంట్ సూపర్వైజర్గా అరుణ పని చేస్తోంది. ఆ రెస్టారెంట్కు తండ్రీకొడుకులు శంకర్, అరుణ్ కుమార్ వచ్చారు. తమ ఫుడ్ ఆర్డర్ చేశాక వారు ఎక్స్ట్రా సాంబార్ డిమాండ్ చేశారు. దీనికి సూపర్వైజర్ అరుణ నిరాకరించింది. ఆమెపై శంకర్, అరుణ్ దాడి చేశారు. కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అరుణ చనిపోయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.