దేశంలోని 40 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామంటూ దుండగుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో విమానాశ్రయాల్లో బాంబు స్క్వాడ్లు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో భారతదేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తుతెలియని వ్యక్తి ఇలాంటి బాంబు బెదిరింపు ఇమెయిల్ను పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.