ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనులు 72శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తయి ఉంటే 7.20లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబేనని ఉద్ఘాటించారు.