ఢిల్లీలోని ఎన్డీయే ఎంపీలు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్హాల్లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఎన్డీయే ఎంపీల భేటీలో 240 మంది భాజపా ఎంపీలతోపాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్జన్శక్తి (రాంవిలాస్), ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.