పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేళ హింస సర్వసాధారణమైపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు మిడ్నాపూర్లో టీఎంసీ కార్యకర్త హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి. తమ్లుక్ లోక్సభ నియోజకవర్గంలోని మహిషాదల్లో టిఎంసి నాయకుడిపై దాడి చేసి, ఆపై చెరువులో పడేశారు. మృతుడి పేరు షేక్ మైబుల్గా పేర్కొన్నారు. ఈ హత్య వెనుక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.