హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై రాయ్పుర్ సీబీఐ కేసు నమోదు చేసింది. ఛత్తీస్గఢ్లో 2015లో చేపట్టిన ఓ పనికి సంబంధించి అధికారులకు లంచం ఇచ్చారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)కు చెందిన 8 మంది అధికారులతోపాటు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలోని మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరిపైన కేసు నమోదైంది.