ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ SP కీలక ప్రకటన

ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కాంకేర్ ఎస్పీ ఇందిరా కల్యాణ్ స్పందించారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 29 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపారు. ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ‘ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో 60 నుంచి 70 మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలిసింది. కాల్పుల సమయంలో కొందరు తప్పించుకున్నారు. త్వరలో కొందరు సరెండర్ అవుతారని భావిస్తున్నాం’ అని ఎస్పీ అన్నారు.

సంబంధిత పోస్ట్