టీ20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ లీగ్ స్టేజ్లోనే నిష్క్రమించింది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ అతిక్ ఉజ్ జమాన్ స్పందించారు. ‘మేం క్రికెట్ ఆడే సమయంలో మాతోపాటు కోచ్, మేనేజర్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 17మంది ప్లేయర్లు ఉంటే 17మంది అధికారులు ఉన్నారు. మొత్తం 60 రూమ్లు బుక్ చేశారు. అసలు మీరంతా క్రికెట్ ఆడటానికి వెళ్లారా? హాలిడేను ఆస్వాదించడానికి వెళ్లారా?’ అని అతిక్ విమర్శించాడు.