వడదెబ్బ కేసులు: ఆస్పత్రులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ

71చూసినవారు
వడదెబ్బ కేసులు: ఆస్పత్రులకు కేంద్రం మార్గదర్శకాలు జారీ
ఢిల్లీ సహా ఉత్తరాదిలో వడగాడ్పులకు ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్ధితుల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వడదెబ్బకు గురవుతున్న కేసులు, మరణాలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని వెల్లడించారు. ప్రజలు ఎండ వేళ బయటకు రావద్దని, ద్రవాహారం అధికంగా తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్