చిత్ర హింసలు పెట్టి.. చెంచు మహిళపై పాశవిక దాడి (వీడియో)

63చూసినవారు
పనికి రావట్లేదని చెంచు మహిళపై పాశవికంగా దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళ ఈశ్వరమ్మ, భర్త ఈదన్న భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కు కౌలుకు ఇచ్చారు. అతని దగ్గరే వీరు పని చేసేవారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ పుట్టింటికి వెళ్లిపోగా వెంకటేష్ ఆమెను పుట్టింటి నుండి తీసుకొచ్చి గదిలో బంధించాడు. ఈశ్వరమ్మ మర్మంగాలపై కారం చల్లి, నిప్పంటించి, కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈశ్వరమ్మను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్