పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన మొదటి సభ్యుడు ‘లాల్ డుహెమా’. ఇతడు 1984లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. 1986లో ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడంతో 1988, నవంబరు 24న లోక్సభ స్పీకర్ ఇతడిని అనర్హుడిగా ప్రకటించారు. ఈయన 2018లో మిజోరం శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తర్వాత ‘జోరాం పీపుల్స్ మూవ్మెంట్’ పార్టీలో చేరడంతో 2020లో డుహెమాను అనర్హుడిగా ప్రకటించారు.