హిమాచల్ప్రదేశ్లో భూకంపం సంభవించింది. చంబా పట్టణంలో గురువారం రాత్రి రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత నమోదైంది. అలాగే చంబా పట్టణానికి దాదాపు 100కి.మీ దూరంలో ఉన్న మనాలీలోనూ భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.