లోక్సభ స్పీకర్ ఎన్నిక కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఏడుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇండియాకు కూటమికి చెందినవారు ఐదుగురు, మరో ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. శశిథరూర్, శత్రుఘ్నసిన్హా లాంటి ప్రముఖులు ప్రమాణ స్వీకారం చేయలేదు. లోక్సభ సభ్యులుగా ప్రమాణం చేయనివారు స్పీకర్ ఎన్నికలో ఓటింగ్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో స్పీకర్ ఎన్నికపై వీరి ప్రభావం చూపెట్టనుందా అనే చర్చ నడుస్తోంది.