గాజా స్ట్రిప్లో గత తొమ్మిది నెలల్లో ఇజ్రాయెల్ మారణహోమంలో 21,000 మంది పిల్లలు అదృశ్యమయ్యారని గాజా పరిపాలన సోమవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. జాబితాల్లో లేదా శరణార్థి శిబిరాల్లో కనిపించని పిల్లలు 21,000 మంది వరకు ఉండవచ్చని నివేదిక పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. పేలుడు పదర్థాలతో వారికి హాని జరిగివుండవచ్చని, ఇజ్రాయిల్ బలగాలు నిర్భంధించి ఉండవచ్చని తెలిపింది.